సుదీర్ఘ సమాలోచనల అనంతరం సామాజిక తరగతులను పరిగణనలోకి తీసుకుని ఏపీ కొత్త కేబినెట్కు సీఎం వైఎస్ జగన్ రూపకల్పన చేశారు. నేడు(సోమవారం) ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్ బిస్వభూషణ్ హరిచంద్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కాగా జగన్ కేబినెట్లో పాత మంత్రి వర్గంలో 11 మందిని కొనసాగించగా, కొత్తగా 14 మందికి అవకాశం కల్పించారు. మొత్తంగా తన మంత్రివర్గంలో 70 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్ చోటు ఇచ్చారు. మొత్తంగా నలుగురు మహిళలు కూడా ఉన్నారు.
కొత్త కేబినెట్లో కొనసాగిన పాత మంత్రుల జాబితా ఇదే..
1.బొత్స సత్యనారాయణ(బీసీ-తూర్పు కాపు)
2.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(రెడ్డి)
3.కే.నారాయణ స్వామి(ఎస్సీ-మాల)
4.అంజాద్ బాషా(మైనార్టీ)
5.సీదిరి అప్పలరాజు(బీసీ-మత్స్యకార)
6.బుగ్గన రాజేంద్రనాథ్(రెడ్డి)
7.చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ(బీసీ-శెట్టిబలిజ)
8.పినిపే విశ్వరూప్(ఎస్సీ-మాల)
9.తానేటి వనిత(ఎస్సీ-మాదిగ)
10.గుమ్మనూరి జయరాములు(బీసీ-బోయ)
11.ఆదిమూలపు సురేష్(ఎస్సీ-మాదిగ)
కొత్తగా మంత్రివర్గంలోకి రానున్న వారు వీరే..
1.ధర్మాన ప్రసాదరావు (బీసీ-పొలనాటి వెలమ)
2.పీడిక రాజన్నదొర (ఎస్టీ)
3.గుడివాడ అమరనాథ్ (ఓసీ-కాపు)
4.బూడి ముత్యాలనాయుడు (బీసీ-కొప్పుల వెలమ)
5.దాడిశెట్టి రాజా (ఓసీ-కాపు)
6.కారుమూరి నాగేశ్వరరావు (బీసీ-యాదవ)
7.కొట్టు సత్యనారాయణ (ఓసీ-కాపు)
8.జోగి రమేష్ (బీసీ-గౌడ)
9.అంబటి రాంబాబు (ఓసీ-కాపు)
10.మేరుగ నాగార్జున (ఎస్సీ-మాల)
11.విడదల రజని (బీసీ-ముదిరాజ్)
12.కాకాని గోవర్ధన్ రెడ్డి (ఓసీ-రెడ్డి)
13.ఆర్కే రోజా (ఓసీ-రెడ్డి)
14.ఉషశ్రీ చరణ్ (బీసీ-కురుబ)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa