సీపీఎం కార్యదర్శిగా సీతారాం ఏచూరి మరోసారి ఎన్నికయ్యారు. వరుసగా మూడోసారి ఆయన ఈ బాధ్యతలు చేపట్టున్నారు. ఆదివారం కేరళలోని కన్నూరులో పార్టీ 23వ కాంగ్రెస్లో ఎన్నికైన 85 మంది సభ్యుల కొత్త కేంద్ర కమిటీ సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరిని ఎన్నుకుంది. 2015 ఏప్రిల్లో విశాఖపట్నంలో జరిగిన 21వ పార్టీ కాంగ్రెస్ తర్వాత తొలిసారి ఈ పదవికి ఏచూరి ఎన్నికయ్యారు. ఏప్రిల్ 18, 2018లో హైదరాబాద్లో జరిగిన 22వ పార్టీ కాంగ్రెస్లో ఏచూరి మళ్లీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2005 నుండి 2015 వరకు వరుసగా మూడు పర్యాయాలు పార్టీలో అత్యున్నత పదవిని గతంలో ప్రకాష్ కారత్ నిర్వహించారు. ఆ తర్వాత ఏచూరి పార్టీ బాధ్యతలను స్వీకరించారు. సీపీఎం రాజ్యాంగం ప్రకారం మూడోసారి ప్రధాన కార్యదర్శిగా ఏచూరి బాధ్యతలు చేపట్టేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు. ఈ సందర్భంగా 69 ఏళ్ల ఏచూరి మాట్లాడుతూ బీజేపీని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓడించడమే పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa