ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిందుత్వంపై బీజేపీకి పేటెంట్ లేదు: శివసేన

national |  Suryaa Desk  | Published : Mon, Apr 11, 2022, 12:58 PM

హిందుత్వంపై పేటెంట్ ఉన్నట్లు బీజేపీ ప్రవర్తిస్తోందని శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే విమర్శించారు. హిందుత్వం, కాషాయం కలిస్తే అధికారంలోకి రావొచ్చని సూచించింది బాల్ థాకరే అని గుర్తు చేశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ నార్త్ నియోజకవర్గానికి మంగళవారం (ఏప్రిల్ 12న) ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో మహావికాస్ అఘాడీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థి జయశ్రీ జాదవ్ బరిలోకి దిగారు. ఆమెకు మద్దతుగా సీఎం ఉద్ధవ్ థాకరే వర్చువల్ ప్రచారంలో ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. భిన్న సిద్ధాంతాలతో ప్రజల్లో బీజేపీ గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు. అసలు రాముడు పుట్టకపోయి ఉంటే, బీజేపీ వారు ఏ పేరుతో రాజకీయాలు సాగించే వారో అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa