ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న హార్దిక్ పాండ్య తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు ఓడిపోయింది. మ్యాచ్లో 13వ ఓవర్ వేసిన హార్దిక పాండ్య భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్లో కేన్ విలియమ్సన్ రెండు సిక్సర్లు కొట్టాడు. ఆ ఓవర్ చివరి బంతికి రాహుల్ త్రిపాఠి కొట్టిన భారీ షాట్ను డీప్ థర్డ్ మ్యాన్లో ఫీల్డింగ్ చేస్తున్న షమీ అందుకోలేకపోయాడు.
దీంతో ఒక్కసారిగా షమిని దూషిస్తూ, తన ఆగ్రహం వెళ్లగక్కాడు. పరుష పదజాలం వాడడం టీవీలో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు హార్దిక్పై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫీల్డర్లు కూడా క్యాచ్లు వదిలేశారని, అయితే సహనం కోల్పోకుండా ఆడిన కేన్ విలిమయ్స్ వారి జట్టుకు విజయం కట్టబెట్టాడనే విషయం గుర్తు చేస్తున్నారు. ఈ మ్యాచ్లో గుజరాత్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 19.1 ఓవర్లలో ఛేదించి, విజయం సాధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa