ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలినేనికి కీలక పదవి...ఒంగోలు పర్యటనలో సీఎం వెల్లడించే అవకాశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 03:24 PM

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కీలక పదవి అప్పగించనున్నట్లు సమాచారం. ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తనకు బెర్త్ దక్కకపోవడంపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అలకబూనిన సంగతి తెలిసిందే. నిన్న కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఇదే సమయంలో బాలినేనిని బుజ్జగించేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మూడు సార్లు బాలినేని ఇంటికి వెళ్లి నచ్చజెప్పారు. చివరకు బాలినేని ముఖ్యమంత్రి జగన్ ను కలవడం, తాను జగన్ తోనే ఉంటానని ఆయన ప్రకటించడం జరిగిపోయాయి. 


మరోవైపు, బాలినేనికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. బాలినేనికి జగన్ ఒక కీలక పదవిని కట్టబెట్టనున్నారనేదే ఆ వార్త సారాంశం. ఈ నెల 22న జగన్ ఒంగోలు పర్యటనకు వెళ్తున్నారు. సున్నా వడ్డీ పథకం కింద డ్వాక్రా మహిళలకు ఆయన నగదును విడుదల చేయనున్నారు. మరోవైపు గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద ప్రకాశం జిల్లాకు చెందిన ఎన్నారైలు ఏర్పాటు చేస్తున్న ఐటీ కంపెనీని జగన్ ప్రారంభించే అవకాశం ఉంది. ఈ కంపెనీ బాలినేని చొరవతోనే ఏర్పాటు కాబోతోంది. ఒంగోలు పర్యటన సందర్భంగా బాలినేని పదవికి సంబంధించి జగన్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa