కారంచేడు మండలం లో ఉపాధి హామీ సిబ్బందితో ఏపీడి భవానీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పనులను తాను తనిఖీ చేస్తానని, అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతీయ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ విజయ ఉపాధి హామీ పథకం పనులు పై ఫోకస్ పెట్టిన నేపధ్యంలో ఆ శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
మంగళవారం కారంచేడు సచివాలయాన్ని కలెక్టర్ సందర్శించి అధికారులను పరుగులు తీయించారు. కొందరు అధికారుల వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేశారు. ప్రధానంగా జాతీయ ఉపాధి హామీ పథకం పనుల గురించి కలెక్టర్ గట్టిగా అడిగారు. ఈసారి పర్యటనలో వచ్చేసరికి అన్ని వివరాలు కావాలని ఆదేశించారు. దీంతో ఏపీడీ భవాని సుడిగాలి పర్యటన చేసి రాత్రి పొద్దుపోయాక కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa