అనకాపల్లి జిల్లాలో ఇద్దరికీ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన నేపథ్యంలో పాయకరావుపేట నియోజకవర్గంలో వైయస్సార్ సీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాధ్ లకు మంత్రి పదవులు ఇచ్చినందుకు సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
బుధవారం నక్కపల్లి లో వైసీపీ కార్యాలయం మహానేత వైఎస్సార్ విగ్రహం వద్ద సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి వైసీపీ పంచాయితీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డి. వి.సూర్యనారాయణరాజు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావులు పాలాభిషేకం చేశారు. సీఎం వై ఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అన్నీ విధాలా అబివృద్ది చెందుతోందను వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa