మరోమారు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏ విషయంలో అంటారా..? ఇటీవల కోర్టు ధిక్కరణ కేసులో శిక్షకు గురైన శ్రీలక్ష్మి అక్కడికక్కడే క్షమాపణ చెప్పడంతో ఆ శిక్షను సేవగా మారుస్తూ ఇటీవల ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏడాది పాటు నెలకో రోజు ప్రభుత్వ వసతి గృహాల్లో సేవ చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.
ఇదిలావుంటే ఈ సేవ విషయంలో పునఃసమీక్ష చేయాలంటూ శ్రీలక్ష్మి తాజాగా హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను తొలుత విచారణకే స్వీకరించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ నిరాకరించగా.. తాజాగా శ్రీలక్ష్మి తరఫు న్యాయివాది వివరణతో పిటిషన్ను విచారణకు అనుమతించారు. ఈ క్రమంలో బుధవారం నాడు విచారణ చేపట్టిన హైకోర్టు శ్రీలక్ష్మి పిటిషన్ను కొట్టివేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa