ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2026లో అహ్మదాబాద్‌-ముంబై బుల్లెట్‌ ట్రైన్‌ ట్రయల్స్‌

national |  Suryaa Desk  | Published : Thu, Apr 14, 2022, 07:30 AM

అహ్మదాబాద్‌-ముంబై బుల్లెట్‌ ట్రైన్‌ తొలిదశ ట్రయల్స్‌ను 2026లో నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. తొలుత గుజరాత్‌ లోని బిలిమొర నుంచి సూరత్‌ మధ్య ఈ ట్రయల్స్‌ నిర్వహించనున్నామని పేర్కొన్నారు. తదుపరి ఇతర సెక్షన్లలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ట్రయల్‌ రన్‌లో భాగంగా గంటకు 350 కి.మీ వేగంతో బుల్లెట్‌ ట్రైన్‌ పరుగులు పెడుతుందని, ఇది విమానం టేకాఫ్‌ అయ్యే వేగంతో సమానమని వివరించారు. అయితే, ప్రజలకు అందుబాటులోకి వచ్చాక గరిష్ఠంగా 320 కి.మీ వేగంతో నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa