ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిలో మామిడి పండ్లు రూ.2.70 లక్షలు

national |  Suryaa Desk  | Published : Thu, Apr 14, 2022, 08:04 AM

మధ్యప్రదేశ్ జబల్​పుర్​ లో సంకల్ప్ సింగ్ పరిహార్ అనే రైతు 28 రకాల మామిడి పండ్లను సాగు చేస్తున్నారు. ఇందులో దేశ విదేశాలకు చెందిన అత్యంత ఖరీదైన మామిడిపండ్లు కూడా ఉన్నాయి. జబల్​పుర్​కు 25 కిలోమీటర్ల దూరంలో నానాఖేదా ప్రాంతంలో శ్రీ మహాకాళేశ్వర్​ హైబ్రిడ్ ఫాం హౌస్ ఉంది. ఆయన ఈ మామిడి తోటకు ఏకంగా 15 శునకాలు, నలుగురు సిబ్బందితో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ పండే మియాజాకి మామిడి పండ్లు కిలో రూ.2.70 లక్షలంటే ఈ తోట ఎంత ఖరీదైనదో అర్థం చేసుకోవచ్చు.


ఇక్కడ పండే మామిడి రకాలు దేశంలో మరెక్కడా ఉండవు. జంబో గ్రీన్​ మ్యాంగోగా పిలిచే 'తలాల గిర్ కేసర్'​ సహా నేపాల్​ రకం కేసర్​ బాదం మ్యాంగో, చైనాకు చెందిన ఐవరీ మ్యాంగో, అమెరికా ఫ్లోరిడాలో పండించే మాంగిఫెరా టామీ ఆట్కిన్స్​ రకాల మామిపండ్లను ఈ తోటలో పండిస్తారు. అత్యంత ఖరీదైన రకాల్లో ఒకటైన ఈ ఫ్లోరిడా మ్యాంగోను 'బ్లాక్​ మ్యాంగో' అని కూడా పిలుస్తుంటారు. ​ఇక ఈ తోటలోనే కాదు దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రత్యేక మామిడి రకం మియాజాకి. దీనిని జపనీస్ ఎగ్​ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఈ రకం మామిడి పండ్ల ధర కిలో ఏకంగా రూ.2.70లక్షలు. ఇలా మొత్తం 8 విదేశాలకు చెందిన మామిడి రకాలు సహా భారత్​కు చెందిన 20 రకాలను సంకల్ప్​ పరిహార్​ సాగు చేస్తున్నారు. అంత విలువైనవి కాబట్టే తోటకు భారీ వ్యయంతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa