సకాలంలో వైద్యం అందక శెట్టూరు మండల పరిధిలోని చెర్లోపల్లి గ్రామానికి చెందిన గణేష్, ఈరక్క దంపతుల కుమార్తె 8 నెలల చిన్నారి పండు మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. చెర్లోపల్లి గ్రామానికి చెందిన గణేష్, ఈరక్కలకు మల్లేశ్వరి, పండు ఇద్దరు కుమార్తెలు ఉన్నారన్నారు. అయితే చిన్నారి పండుకు ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఒక్కసారిగా కళ్ళు తెరవకుండా పడిపోవడంతో 108 వాహనంకు ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో వెంటనే ద్విచక్ర వాహనంలో మామ ప్రశాంత్, తల్లిదండ్రులు చిన్నారిని వైద్య నిమిత్తం కళ్యాణదుర్గం కు తీసుకుని వస్తుండగా మార్గమధ్యంలో ట్రాఫిక్ పోలీసులు అడ్డగించారన్నారు. మరి కొద్దిసేపటికి వదిలారన్నారు అప్పుడు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారన్నారు. దీంతో ఆవేశానికి గురైన తల్లిదండ్రులు మరణించిన చిన్నారి మృతదేహాన్ని తీసుకుని టీ సర్కిల్లో కూర్చుని తమ బిడ్డను బ్రతికించాలంటూ బోరున విలపిస్తూ నిరసన తెలిపారన్నారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చిన్నారి మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. అదే సమయంలో మంత్రి ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తుండగా ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని పోలీసులు కలగజేసుకుని వారికి సర్ది చెప్పే వారిని సొంత ఊరికి పంపించారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa