ఐపీఎల్ విషయంలో ఈ సారి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకొంది. ఈ సారి ఐపీఎల్ ముగ్గింపు వేడుకలను నిర్వహించాలని భావించారు. దేశంలో కరోనా పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ టోర్నీకి ముగింపు వేడుకలు జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈవెంట్ మేనేజ్ మెంట్ కోసం టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండరు ప్రక్రియలో పాల్గొనదలచిన వారు రూ.1 లక్ష ఫీజు (నాన్ రిఫండబుల్)తో పాటు అదనంగా రూ.18 వేల జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అందుకు ఏప్రిల్ 25వ తేదీ తుదిగడువు. తమకు అనుకూలమైన మొత్తానికి బిడ్ దాఖలు చేసినవారికి బీసీసీఐ ఐపీఎల్ క్లోజింగ్ సెర్మనీ నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తుంది.
ఐపీఎల్ తాజా సీజన్ లో ఫైనల్ మ్యాచ్ మే 29న జరగనుంది. ఈ టైటిల్ సమరానికి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. టోర్నీ ముగింపు వేడుకలు కూడా ఇక్కడే నిర్వహించే అవకాశాలున్నాయి. ఇదిలావుంటే కరోనా వ్యాప్తి కారణంగా గత కొన్ని సీజన్లకు ముగింపు వేడుకలు నిర్వహించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa