వెన్నుపోటు పేటెంటు నీ యజమాని చంద్రబాబుది అని బండ్ల గణేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ల మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతూనే ఉంది. శనివారం ఉదయం బండ్ల గణేశ్ ట్వీట్తో మొదలైన ఈ యుద్ధం... సాయంత్రం దాకా నాన్ స్టాప్గా కొనసాగుతూనే ఉంది. బండ్ల ట్వీట్కు సాయిరెడ్డి ఘాటుగా స్పందించగా... దానిపై బండ్ల మరింత ఘాటుగా స్పందించారు. తాజాగా బండ్ల గణేశ్ను మరింతగా విమర్శిస్తూ విజయసాయిరెడ్డి రివర్స్ ట్వీట్ వదిలారు. ఈ ట్వీట్లో సాయిరెడ్డి చాలా కీలక అంశాలను ప్రస్తావించడంతో పాటుగా కుక్క కాటుకు చెప్పు దెబ్బలు తప్పవంటూ బండ్లకు వార్నింగ్ ఇచ్చారు.
వరుసగా సంధించిన మూడు ట్వీట్లలో విజయసాయిరెడ్డి పేర్కొంటూ... బ్రోకర్లు, తార్పుడుగాళ్లు, మోసగాళ్లు, జేబులు కొట్టేవాళ్ళు ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళని విమర్శిస్తే పెద్దోళ్లు అయిపోతామని భ్రమపడుతుంటారు.. బండ్లలాగా. ఎన్నిసార్లు తన్నులు తిన్నది, ఎవరెవరి కాళ్లుపట్టుకున్నదీ అతని జాతకం లైట్ బోయ్ నుంచి అందరికీ తెలుసు. కుక్కకాటుకు చెప్పుదెబ్బలు తప్పవు.
వెన్నుపోటు పేటెంటు నీ యజమాని చంద్రబాబుది. 28 ఏళ్లుగా చెక్కు చెదరని గిన్నెస్ రికార్డు. ఇంకో వందేళ్లయినా అది బాబు పేరనే ఉంటుంది. ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా బండ్లా? ప్రతి కుక్కా సింహం కావాలనుకుంటుంది. నీలాంటి వాడే భౌ..భౌమని మొరిగి గర్జించా అనుకుని మురిసిపోతుంటాడు.
నీవు మర్చిపోయినట్టు నటిస్తున్నా సచిన్ జోషి మాత్రం నిన్ను జీవితాంతం వెంటాడుతుంటాడు. మూవీకి అతను ఫైనాన్స్ చేస్తే రైట్స్ నువ్వు అమ్ముకున్నావంట. చెప్పు తెగేలా కొట్టింది, ఫోన్ పగిలింది నిజమేనా బండ్లా? రామ్ చరణ్, ఎన్టీఆర్, పూరీలను ఛీట్ చేసినా వదిలేశారు. అందరూ వాళ్లంత మంచోళ్లు కారు" అంటూ ఘాటుగా స్పందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa