గుజరాత్ ను గెలిపించిన ఘనత డేవిడ్ మిల్లర్ దేనని కెప్టెన్్ రవీంద్ర జడేజా అన్నారు. గత రాత్రి చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్లతో విజయం సాధించిన విషయం తెలిసిందే. డేవిడ్ మిల్లర్ ఈ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు సారథి రవీంద్ర జడేజా మీడియాతో మాట్లాడుతూ.. ఈ మ్యాచ్లో మొదట తాము అద్భుతంగా రాణించామని అన్నాడు.
తొలి ఆరు ఓవర్లు బౌలర్లు అంతగా పరుగులు ఇచ్చుకోలేదని చెప్పాడు. అయితే, ఆ తర్వాత గుజరాత్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ బాగా రాణించాడని, గుజరాత్ను గెలిపించిన క్రెడిట్ అంతా అతడికే దక్కుతుందని తెలిపాడు. మిల్లర్ మంచి షాట్లు ఆడాడని చెప్పాడు. తాము సాధించిన 169 పరుగులు గుజరాత్ ను ఓడించడానికి సరిపోతాయని అనుకున్నట్లు తెలిపాడు. చివరి ఐదు ఓవర్లలో తమ ప్రణాళికలను అమలు చేయలేకపోయామని అన్నాడు.
ఇదిలావుంటే ఈ మ్యాచ్లో 3.5 ఓవర్లు బౌలింగ్ చేసిన క్రిస్ జోర్డాన్ 58 పరుగులిచ్చాడు. అయితే, అతడికి ఉన్న అనుభవంతోనే ఫైనల్ ఓవర్లో బౌలింగ్ ఇచ్చానని జడేజా అన్నాడు. మామూలుగా అతడు ఓవర్కు దాదాపు 5 యార్కర్లు వేయగలడని, తాజా మ్యాచ్లో మాత్రం అది కుదరలేదని చెప్పాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa