పోలవరం ప్రాజెక్టును తగ్గించే కుట్ర సాగుతోందని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ఈమేరకు పోలవరం గురించి ఏపీ సీఎం జగన్కు ఆయన ఓ లేఖ రాసి పలు అంశాలు వివరించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర సర్కారు కలిసి పోలవరం ఎత్తును 135 అడుగులకు తగ్గించే కుట్రలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపణలు గుప్పించారు. పోలవరం ఏపీకి జీవనాడి వంటిదని, ఆ ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర సర్కారు తీరుకి తలొగ్గకూడదని రామకృష్ణ సూచించారు. ఒకవేళ తలొగ్గితే ఏపీకి తీరని ద్రోహం చేసినవారవుతారని ఆయన పేర్కొన్నారు. పోలవరంపై రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి తాజాగా చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని ఆయన అన్నారు. పోలవరం విషయంపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa