శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం కూడలి నుంచి లోలుగు, పొందూరు మీదుగా రాజాం వెళ్లే రహదారి ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ముఖ్యంగా చిలకపాలెం నుంచి పొందూరు మధ్య పలు కూడళ్ళలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. సుమారు 11 కిలోమీటర్ల దూరం కలిగిన ఈ రోడ్డులో ఇటీవల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందగా, అనేక మంది గాయాలపాలయ్యారు. ఈ రహదారిలో మలుపులు ఎక్కువగా ఉండటం, వేగ నియంత్రణ చర్యలు లేకపోవడం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం. కీలకమైన పెద్దకొత్తపల్లి, లోలుగు, రెడ్డి పేట, కృష్ణాపురంతో మరికొన్ని కూడళ్ళలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం మరో కారణంగా ఉంది. ఇక ఈ ప్రాంతంలో ఉన్న 24 స్టోన్ క్రషర్ల నుంచి లారీలు, ట్రాక్టర్లు పెద్దఎత్తున రాకపోకలు సాగించడం, వారు నిబంధనలు పాటించక పోవడం కూడా ప్రమాదాలకు మూలంగా మారింది. ఇప్పటికైనా పోలీసులు, అధికారులు తగిన స్పందించి, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa