దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరలా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, కేరళలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దేశవ్యాప్తంగా నమోదయ్యే కేసులు, మరణాలలో ఈ రెండు రాష్ట్రాల నుంచే అధిక మొత్తంలో ఉంటున్నాయి. ఈ తరుణంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇక నుంచి మాస్కు ధరించకుంటే రూ.500లు జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది. దీనిపై బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరిన్ని ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కరోనా కేసులు నమోదైన పాఠశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఆ రాష్ట్రంలో 622 కేసులు నమోదవడంతో కట్టడి దిశగా పలు చర్యలు తీసుకుంటోంది.
ఇదిలా ఉండగా కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్న 5 రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, హర్యానా, మిజోరం రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,067 మందికి పాజిటివ్ కేసులు, 40 మంది మరణిండంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల కాలంలో యాక్టివ్ కేసుల సంఖ్య 10 వేలకు దిగువన ఉండగా ప్రస్తుతం 12,340 యాక్టివ్ కేసులు ఉన్నాయని వెల్లడించింది. సోమవారం వెల్లడైన గణాంకాలు కూడా ఆందోళనకరమని పేర్కొంది. సోమవారం ఒక్కసారిగా 2,183 కేసులు, 214 మరణాలు సంభవించడం హెచ్చరికగా పేర్కొంది. అయితే మరణాల సంఖ్య తక్కువగా నమోదవడం, మహమ్మారి బారిన పడిన వారు 5 రోజుల్లోనే కోలుకుంటుండడం శుభపరిణామమని నిపుణులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa