ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామాయపట్నం పోర్టు మీద ద్రుష్టి సారించిన మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 21, 2022, 12:04 PM

పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రిగా గుడివాడ అమర్‌నాథ్‌ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.  సచివాలయంలోని తన ఛాంబర్‌లో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ప్రత్యేక పూజల చేసిన‌ అనంతరం త‌న కేటాయించిన బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు. త‌న‌కు మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా త‌న‌ను ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి స్ధానంలో కూర్చోబెట్టే అవకాశం ఇచ్చిన అనకాపల్లి ప్రజలకి ఎప్పటికీ రుణపడి ఉంటాన‌న్నారు. ఈ సందర్భంగా రామాయపట్నం పోర్టుకి అవసరమైన భూసేకరణలో భాగంగా రైతులకి ఇచ్చే రూ.8కోట్ల పరిహారంపై తొలి సంతకం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa