ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 21, 2022, 12:47 PM

చంద్రగిరి మండలంలో కల్యాణిడ్యామ్ పోలీసు శిక్షణ కేంద్రం సమీపంలోని గుట్ట ప్రాంతంలో గ్రావెల్ ను తవ్వి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని తిరుపతి గ్రామీణ మండలం తరలిస్తున్నారు. పగలూ రాత్రీ లేకుండా అక్రమ రవాణా జరుగుతున్నా ఇక్కడెవరూ పట్టించుకోవడం లేదు. ఇటువంటి విషయాల్లో చూసీచూడనట్లుగా వ్యవహరించాలని ప్రజాప్రతినిధుల నుంచి ఆదేశాలు ఉండటంతో అధికారులు మిన్నకుండిపోతున్నారనే విమర్శలున్నాయి. ఇదే మండలంలోని రంగంపేట పంచాయతీ గజేంద్రనగర్ నుంచి ఇటుక బట్టీల కోసం ఎర్రమట్టిని తవ్వుతున్నారు. మిట్టపాళెం పంచాయతీ కొత్తూరు దళితవాడ వద్ద ఇసుకను మాయం చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa