బాపట్ల జిల్లా, మండల కేంద్రం భట్టిప్రోలు లోని తమ్మన మల్లికార్జునరావు ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న 82 మంది 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని విశ్రాంత ఉపాధ్యాయులు బొలిశెట్టి శ్రీనివాసరావు అందజేశారు.
విద్యార్థులంతా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని అదే విధంగా మంచి చేతివ్రాతతో ప్రశ్నలకు జవాబులు రాయడం వలన మంచి మార్కులు సాధించవచ్చు అని తెలిపారు.
రాబోయే వేసవి కాలపు సెలవుల్లో విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ నేర్చుకోవడం వలన నాలెడ్జి తో బాటు జీవనోపాధికి దోహదపడుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ పులికొండ మల్లికార్జునరావు, ప్రధానోపాధ్యాయులు రామకోటేశ్వరరావు, చేబ్రోలు శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, బెల్లంకొండ శ్రీనివాసరావు, సూరేపల్లి మాజీ ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, కోటేశ్వరమ్మ, లక్ష్మీపార్వతి, విద్యార్థులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa