విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ప్రభుత్వమే నడపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐవైఎఫ్ ఏఐయస్ఎఫ్ గుంటూరు జిల్లా నేతలు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ ముందు విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ప్రభుత్వమే నడపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐవైఎఫ్ ఏఐయస్ఎఫ్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలక్టరేట్ లో డిఆర్ఓ చంద్రశేఖర్ రావుకు నేతలు వినతిపత్రం అందజేశారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన విరమించుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించి, కడప ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు కేంద్రం నుండి నిధులు విడుదల చేయాలని గుంటూరు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందెల నాసర్ జీ డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa