బుక్కరాయసముద్రం మండల పరిధిలోని సంజీవపురం గ్రామంలో ఎర్రినాగప్ప అనే రైతు పురుగు మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. రైతు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు. ఎర్రినాగప్ప హెచ్చెల్సీ కాలువ పక్కన తనకున్న వ్యవసాయ భూమిలో చీనీతోట సాగు చేశాడు. కాలువ పక్కనే ఊటకుంటను తవ్వుకుని, కుంటలో ఊరిన నీటిని పొలానికి పెట్టుకునేవాడు. అయితే కుంట హెచ్చెల్సీకి సంబంధించిన స్థలంలో ఉందని, పూడ్చ టానికి యత్నించారు. కుంటను పూడ్చవద్దని రైతు అధికా రులను వేడుకున్నాడు. అధికారులు పొక్లెయిన్ తీసుకురావ డంతో మనస్తాపానికి గురైన రైతు తోటలోకి వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతన్ని బంధు వులు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఈ విషయంపై బుక్కరాయసముద్రం పోలీసులను వివరణ కోరగా తమకు ఫిర్యాదు అందలేదని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa