తన ఎలక్ట్రిక్ వాహనాలను ఓలా సంస్థ వెనక్కి తీసుకొంటోంది. ఎలక్ట్రిక్ బైక్ లు పేలుతున్న నేపథ్యంలో ఓలా ఈ నిర్ణయం తీసుకొంది. దేశ ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలపై ఇప్పుడిప్పుడే ఆసక్తి పెంచుకుంటూ కొనుగోళ్లు జరుపుతున్నారు. ఈ సానుకూల పరిణామం వల్ల కాలుష్యం తగ్గుతుందని, పెట్రోలు వినియోగం, దిగుమతులు తగ్గుతాయని భావిస్తోన్న వేళ అనేక ప్రాంతాల్లో ఈ-బైక్ల పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. వాటి బ్యాటరీల నాణ్యత, ఇతర కారణాలు ఈ ప్రమాదాలకు కారణాలని నిపుణులు చెబుతోన్న వేళ ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం తీసుకుంది. పూణెలో ఇటీవల జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని 1,441 యూనిట్ల ఈ-బైక్లను రీకాల్ (వెనక్కి పిలిపించడం) చేస్తున్నట్లు తెలిపింది.
ఇటీవల ప్రమాదానికి గురైన ఈ-స్కూటర్ తో పాటు ఆ బ్యాచ్లో తయారయిన అన్ని బైక్లనూ పరిశీలించాలని నిర్ణయించినట్లు ఓలా తెలిపింది. అందుకే ఆ బైక్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు వివరించింది. ఆ స్కూటర్లలోని బ్యాటరీలు, థర్మల్ వ్యవస్థలపై తమ సర్వీస్ ఇంజనీర్లు సమీక్ష నిర్వహిస్తారని చెప్పింది. భారత బ్యాటరీ ప్రమాణాలతో పాటు ఐరోపా ప్రమాణాలకు కూడా తమ స్కూటర్లలో అమర్చిన బ్యాటరీలు సరిపోతాయని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa