ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ రాజధానిలో కుప్పకూలిన బిల్డింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 25, 2022, 05:03 PM

దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం సోమవారం కుప్పకూలింది. సమాచారం అందుకున్న వెంటనే ఆరు అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇల్లు మరమ్మతులు చేస్తుండగా కూలిపోయిందని తెలుస్తోంది. దీనిపై ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ స్పందించారు. సత్య నికేతన్ బిల్డింగ్ నంబర్ 173లో ఇల్లు కూలిపోవడం గురించి తమకు సమాచారం వచ్చిందన్నారు. ఆరు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి పంపించామని వెల్లడించారు. శిథిలాల క్రింద ఐదుగురు కూలీలు చిక్కుకున్నారని ఆయన తెలిపారు. వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు ఆ భవనం డేంజర్ జోన్‌లో ఉన్నట్లు మార్చి 31 న నోటీసు అందించామని ఢిల్లీ మేయర్ ముఖేష్ తెలిపారు. దీనిపై తాము ఏప్రిల్ 14న పోలీసులకు కూడా సమాచారం అందించామన్నారు. అయినప్పటికీ వారు నిర్మాణం చేపట్టడంతో ఈ పరిస్థితి తలెత్తిందని భావిస్తున్నట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa