గత వారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్తో భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ భేటీ సందర్భంగా ఏపీలోని తాజా పరిస్థితులను రాష్ట్రపతికి గవర్నర్ వివరించారు. గతవారం ఉన్నట్టుండి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన గవర్నర్ బిశ్వభూషణ్...తన ఢిల్లీ టూర్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కూడా భేటీ అయిన సంగతి తెలిసిందే. సోమవారం నాటి రాష్ట్రపతి భేటీతో గవర్నర్ ఢిల్లీ టూర్ ముగిసింది. మంగళవారం గవర్నర్ తిరిగి విజయవాడ బయలుదేరతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa