మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి నవులూరు 12 వార్డు ఎలిమెంట్రీ పాఠశాల నుండి 2 వ రోడ్డులో ఉన్న ప్రజలు రోడ్డు లేక, మురుగు పోయే డ్రెయిన్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఈ రోడ్డులో కచ్చా రోడ్డు నిర్మాణం సైతం నిర్మాణం జరగలేదు. మక్కెవారిపేట అమరావతి టౌన్ షిప్ రోడ్డును ఆనుకొని ఉత్తర దిశ నుండి దక్షిణ దిశగా ఉన్న మారుతీ నగర్ ఎన్. వీ. ఎస్ పాఠశాల కు వెళ్ళే మార్గాన్ని కలుపుకొని సుమారు 100 మీటర్ల పొడవు ఉన్న మార్గంలో కొన్నేళ్లుగా రోడ్డు నిర్మాణం గానీ, డ్రెయిన్ల నిర్మాణం గానీ జరగలేదు. వర్షాకాలం వస్తే ఈ మార్గంలో మోకాలు లోతు నీళ్లు, మురుగుతో నిండిపోయి నడిచేమార్గంలేక, ప్రత్యామ్నాయ రోడ్డు లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పంచాయితీగా ఉన్న సమయంలో నాటి పంచాయితీ వార్డు మెంబర్, ఎం. పీ. పీ హయాంలో ఈ మార్గంలో సుమారు 50 మీటర్ల లోపు సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది. మిగిలిన 50 మీటర్ల రోడ్డు నిర్మాణం చేసి సంబంధిత అధికారులు సమస్య పరిష్కారం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
మక్కెవారి పేట నుండి మారుతీనగర్ వెళ్లేందుకు ప్రజలకు ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా రోడ్డుకు ఇరువైపులా మురుగు నీరు పారెందుకు డ్రెయిన్లు లేకపోవడంతో సమీపంలో నివసిస్తున్న 20 గృహాల ప్రజలు ఇంటి అవసరాలకోసం వాడుతున్న నీరంతా రోడ్డుకు ఒక ప్రక్కన చేరుతుండటంతో అక్కడ ఓ పెద్ద మురుగునీటి మడుగు ఏర్పడింది. దీని వల్ల పెద్ద ఎత్తున దోమలు, పందులు చేరడంతో ఇళ్ళల్లో ఉండటం కష్టంగా మారిందని వారు వాపోతున్నారు. ప్రధానంగా రోడ్డులో మురుగు పోయేందుకు డ్రెయిన్ల నిర్మాణం చేయాలని, అలాగే సీసీ రోడ్డు లేదా కనీసం కచ్చా రోడ్డు నిర్మాణం చేసి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa