ఏపీ మంత్రి కాకానికి హైకోర్టు మంగళవారం నోటీసులు అందజేసింది. నెల్లూరు కోర్టులో చోరీ అంశంపై సుమోటోగా తీసుకుని, ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ ప్రారంభించింది. కేసు దర్యాప్తు సరైన దిశలో జరగడం లేదన్న నెల్లూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు నేరుగా విచారణ చేపట్టింది. ఈ కేసును సీబీఐకు అప్పగించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అడ్వొకేట్ జనరల్ ధర్మాసనానికి తెలిపారు. దీంతో ఈ అంశంపై ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, సీబీఐ డైరెక్టర్, ఏపీ డీజీపీకి నోటీసులు అందజేసింది. అనంతరం ఈ కేసులో విచారణను హైకోర్టు మే 9వ తేదీకి వాయిదా వేసింది.
నెల్లూరు జిల్లా కోర్టులో రెండు వారాల క్రితం చోరీ జరిగింది. చోరీకు గురైన ఫైళ్లలో ప్రస్తుతం ఏపీ మంత్రిగా ఉన్న కాకాణి గోవర్దన్ రెడ్డి నిందితుడుగా ఉన్న కేసుకు సంబంధించిన ఆధారాలున్నాయి. దీని వెనుక మంత్రి ప్రమేయం ఉందని టీడీపీ ఆరోపించింది. గతంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో ఆస్తులున్నాయని కాకాణి ఆరోపించారు. అందుకు సంబంధించిన కొన్ని పత్రాలను సమర్పించారు. అయితే అవన్నీ తప్పుడువని సోమిరెడ్డి ఆరోపిస్తూ, కేసు పెట్టారు. దీంతో ఆధారాలను ధ్వంసం చేసేందుకే చోరీ జరిగిందని టీడీపీ ఆరోపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa