పెళ్లైన కొన్ని గంటలకే వధువు పారిపోయిన ఘటన యూపీలోని ఆగ్రా జిల్లాలో జరిగింది. అలీగఢ్కు చెందిన ఖుషీరామ్ కు వయసైపోతున్నా పెళ్లి కావడం లేదు. ఈ క్రమంలో గోవింద్పుర్ కు చెందిన బంటీ అనే వ్యక్తి ఖుషీరామ్ కుటుంబాన్ని కలిశాడు. ఖుషీరామ్ కు అమ్మాయిని వెతికి పెడతానని చెప్పాడు. ఏప్రిల్ 24న ఆగ్రాలోని ఓ హోటల్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు. ఓకే అయితే అదే రోజు పెళ్లి చేసేద్దామని బంటీ చెప్పాడు. ఇందుకు ఖుషీరామ్ పేరెంట్స్ ఒప్పుకున్నారు.
ఉదయం పెళ్లి చూపులు కాగా, అదే రోజు రాత్రి అక్కడే పెళ్లి జరిగింది. అంతా కలిసి వరుడి ఇంటికి వెళ్లారు. పెళ్లి సమయంలో వధువు కుటుంబం వరుడి కుటుంబం దగ్గర నుంచి రూ.లక్షన్నర నగదు, చీరలు, ఆభరణాలు తీసుకుంది. అయితే పెళ్లి రిజిస్ట్రేషన్ కోసం నవదంపతులు కోర్టుకు వెళ్లారు. ఆ సమయంలో బాత్రూంకు వెళ్లొస్తానని చెప్పిన నవవధువు ఎంతసేపటికీ రాలేదు. మిగిలినవారూ కూడా కనిపించలేదు. దీంతో తాము మోసపోయినట్లు వరుడి కుటుంబానికి అర్థమైంది. పెళ్లి కుదిర్చిన బంటీని సంప్రదించారు. హోటల్కు వస్తే డబ్బు తిరిగిప్పిస్తానని అతడు చెప్పాడు. కానీ రాలేదు. దీంతో వరుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa