రాష్ట్ర ప్రభుత్వం పొదుపు సంఘాలకు ఆడిట్ నిర్వహిస్తుందని ఈ క్రమంలో పొదుపు సంఘాల సభ్యులు కమ్యూనిటీ ఆడిటర్లకు సహకారం అందించాలని వైయస్సార్ క్రాంతి పదం ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాస రావు అన్నారు. మంగళవారం వెలుగు కార్యాలయంలో ఈ అంశంపై సంఘ బంధాలకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వచ్చే నెల 10వ తేదీ నుంచి జూన్ నెల ఆఖరి వరకు మండలంలోని 1246 పొదుపు సంఘాలకు ఆడిట్ నిర్వహిస్తామని తెలిపారు.
38 సంబంధాల్లోని నైపుణ్యం, అవగాహన, సామాజిక స్పృహ, విద్యార్హత కలిగిన వారిని సుమారు 25 మందిని ఎంపిక చేసి కమ్యూనిటీ ఆడిటర్లు గా గుర్తించి శిక్షణ కల్పిస్తామని వారందరూ ఆడిట్ నిర్వహిస్తారని ఏరియా కోఆర్డినేటర్ తెలిపారు.
పొదుపు సంఘం ప్రారంభ దశ నుంచి ఇప్పటివరకు జరిగిన ఆర్థిక లావాదేవీలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణాలు తదితర అంశాలతో కూడిన నివేదిక తయారు చేసి ఆడిట్ చేయడం జరుగుతుందని ఏరియా కోఆర్డినేటర్ పేర్కొన్నారు.
తప్పనిసరిగా పొదుపు సంఘాల సభ్యులు సంబంధిత రికార్డులు చూపించాలని ఆయన తెలిపారు. పొదుపు సంఘం లోని ఒక్కొక్క సభ్యురాలు 20 రూపాయలు వంతున చెల్లించాలని ఆ మొత్తాన్ని కమ్యూనిటీ ఆడిటర్లకు ఇవ్వడం జరుగుతుందని ఏరియా కోఆర్డినేటర్ అన్నారు.
ఎక్కడైనా పొదుపు సంఘాల లో అవినీతి, అక్రమాలు , రికార్డు నిర్వహణ తప్పులు జరిగి ఉంటే ఈ ఆడిట్ నందు బహిర్గతం అవుతాయని ఆయన అన్నారు. పొదుపు సంఘాల నిర్వహణ పారదర్శకత కు ఈ ఆడిట్ దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం విజయలక్ష్మి, సిబ్బంది చంద్ర, సంఘ బంధాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa