కాకినాడ జిల్లా పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్ తనను తల్లిని చేసి మోసం చేశాడని ఓ మహిళ కాకినాడ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. కిర్లంపూడి మండలంలోని ఓ మహిళకు 36 సంవత్సరాలు. తనకు 11 ఏళ్లు ఉన్నప్పుడు గాంధీ మోహన్ ఇంట్లో పని చేశానని, 13 ఏళ్ల వయస్సున్నప్పుడు తనకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడని ఆమె ఆరోపించింది. తాను గర్భవతినైతే మూడు సార్లు అబార్షన్ చేయించాడని తెలిపింది. 2003లో తాను మగబిడ్డకు జన్మనిచ్చానని, తమ ఆలనా పాలన చూస్తు రెండు లక్షలు కూడా బ్యాంకులో డిపాజిట్ చేశాడని మహిళ తెలిపింది.
గత ఏడాది వరకు తనతో సహజీవనం చేశాడని, ఆరు నెలల నుంచి తనను, తన కొడుకును దూరం పెడుతున్నాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. తనను రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్ర ప్రకారం ఇలా చేస్తున్నారని, కోర్టులోనే దీని పై తేల్చుకుంటానని మాజీ ఎమ్మెల్యే గాంధీ మోహన్ అన్నారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రబాబు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa