సంక్షేమ పథకాల్లో 75 శాతం వాటా మహిళలదే అని పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళా సాధికారత దిశగా సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. సీఎం వైయస్ జగన్ మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలిపారు.
టీడీపీ.. మహిళా ద్రోహి పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో కన్నా ఉన్మాదులు దేశంలో ఎక్కడైనా ఉన్నారా? అని సూటిగా ప్రశ్నించారు. సీఎం వైయస్ జగన్ ఇమేజ్ను దిగజార్చాలని టీడీపీ బూతు పురాణంతో మాట్లాడుతోందని మండిపడ్డారు. దమ్మున్న నాయుకుడు సీఎం వైయస్ జగన్ అని అన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మహిళల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు.
దిశా పోలీస్ స్టేషన్లను పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రశంసించిందని మంత్రి రోజా గుర్తుచేశారు. చంద్రబాబు మహిళల కోసం ఒక్క పథకమైనా తెచ్చారా? అని నిలదీశారు. మహిళల సాధికారతకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్ అని కొనియాడారు. చంద్రబాబు ఎందుకు నిరసనలు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అశోక్ జైన్ అనే టీడీపీ కార్పొరేటర్ అఘాయిత్యానికి పాల్పడితే ఆ రోజు చంద్రబాబు ఎందుకు నిరసనలు చేయలేదు? అని ప్రశ్నించారు.
లోకేష్ పీఏ పార్టీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ రోజు ధర్నాలు ఎందుకు చేయలేదని రోజా నిలదీశారు. సీఎం వైయస్ జగన్, వైయస్ భారతి గురించి తప్పుడు మాటలు మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. టీడీపీ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బూటు కాలితో మహిళలను కొడతాడని, వాళ్లు కాదా ఉన్మాదులని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa