రాష్ట్ర నర్సింగ్ ఉద్యోగ పోస్టుల భర్తీలో 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లకు అవకాశం లేకుండా నియామకాలను చేపడుతూ వైసిపి ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తోందంటూ బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్లు నారా లోకేష్ ను కలిసారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... తాజా నోటిఫికేషన్లో సీపీసీహెచ్ కోర్సులేదనే సాకుతో తమను అనర్హులుగా చేసి 2021 తరువాత బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేసిన వారికి మాత్రమే అర్హతను కల్పించిందని ఆవేదన వ్యక్తం చేసారు.నియామకాల్లో వారికి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చాను. నర్సింగ్ గ్రాడ్యుయేట్లు చేస్తున్న పోరాటానికి పూర్తి స్థాయి మద్దతు ఉంటుంది. వారి న్యాయ పోరాటానికి సహాయం అందిస్తాము అని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa