గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం బిళ్ళనపల్లి గ్రామం లో ప్రభుత్వ భూమి ని ప్రైవేట్ భూమి గా చూపించి పర్మీషన్ ఇచ్చిన ప్రభుత్వ అధికారులు. బిళ్ళనపల్లి వి ఆర్ ఓ ఎసైన్డ్ ల్యాండ్ అని రికార్డ్ లో ఉందని చెపుతున్నారు. బాపులపాడు తసీల్దార్ మాత్రం ప్రైవేట్ ల్యాండ్ గా మైనింగ్ అధికారులకు చూపిస్తారు. మైనింగ్ అధికారులు పర్మీషన్ ఇచ్చేస్తారు టిడిపి నాయకులు అక్రమ మైనింగ్ చేసుకుని టిడిపి ని బలోపేతం చేసుకుంటూ పార్టీని నడిపిస్తారు. ఒక పక్క సీఎం జగన్ ఎక్కడ అవినీతి జరిగినా సహించేది లేదు , అని చెబుతున్నా కొందరికి అవి వినబడటం లేదు ఇంకెన్నాళ్ళు ఈ దోపిడి? వైయస్ ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు రంగం లో కి దిగి అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాల్సిన సమయం ఆసన్నమైందని గన్నవరం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు చెబుతున్నారు. మైనింగ్ అధికారుల ఒక మాట? వి ఆర్ ఓ చూపిస్తుంది ఒక మాట? తాసిల్దార్ ది ఒక మాట? ఎవరి మాట పరిగణలోకి తీసుకోవాలి అంటున్న ప్రజానీకం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa