ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన సందర్భంగా రేణిగుంట విమానాశ్రయం నుంచి పర్యటన ప్రాంతాలన్నీ అధికారులతో కలిసి తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. విమానాశ్రయం, టాటా క్యాన్సర్ హాస్పిటల్, తారకరామా స్టేడియంల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసిన జిల్లా పోలీసు శాఖబందోబస్తు ఏర్పాట్లను జిల్లా యస్. పి పి. పరమేశ్వర రెడ్డి పరిశీలించి ముందస్తు భద్రతా పరమైన చర్యలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని పోలీసు అధికారులకు సూచించారు.
ట్రాఫిక్ నియంత్రణకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలోఎల్. అండ్. ఓ అడిషినల్ యస్. పి అరిపుళ్ళా, ఎస్బి డిఎస్పీ రమణ, డీఎస్పీలు ఈస్ట్ మురళి కృష్ణ, వెస్ట్ నారసప్ప, ట్రాఫిక్, విజయ శేఖర్, సిఐ రామ సుబ్బయ్య పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa