ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిందితులకు శిక్ష పడే దాకా వదిలిపెట్టబోం: మంత్రి విడదల రజనీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 01, 2022, 05:03 PM

రేపల్లే రైల్వే స్టేషన్ లో అత్యాచార ఘటన నిందితులకు శిక్ష పడే దాకా వదిలిపెట్టబోమని మంత్రి విడదల రజినీ స్పష్టంచేశారు. రేపల్లె రైల్వే స్టేషన్ లో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినీ స్పందించారు. ఘటన బాధాకరమన్నారు. సీఎం జగన్ దీనిపై స్పందించారని, నిందితులకు శిక్ష పడే దాకా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీ, అధికారులతో మాట్లాడుతున్నామని ఆమె చెప్పారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారన్నారు. బాధితురాలి ఆరోగ్యం గురించి ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడామని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. బాధితురాలికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 


ఇదిలావుంటే రేపల్లె రైల్వే స్టేషన్ ను మంత్రి మేరుగ నాగార్జున పరిశీలించారు. ఇలాంటి ఘటనలను నివారించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కొన్ని మూకలు కర్కశంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలిని, ఆ కుటుంబాన్ని పరామర్శించాలని సీఎం జగన్ తనను ఆదేశించారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa