సాధారణంగా చాలా మంది పొడిదగ్గుతో సతమతం అవుతూ ఉంటారు. వాతావరణ మార్పుల వలన, శీతలపానీయాలను ఎక్కువగా తాగడం వలన దగ్గు వస్తుంది. అయితే ఇలాంటి పొడి దగ్గు తగ్గాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. దీంతో దగ్గు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.
- అల్లం టీని తీసుకోవడం వల్ల పొడి దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.
- చిటికెడు పసుపు, నిమ్మరసం, తేనె కలిపిన మిశ్రమాన్ని మూడు పూటలా తీసుకోవాలి.
- అర టీ స్పూన్ శొంటి పొడిని ఒక టీ స్పూన్ తేనెలో కలిపి తాగాలి. అలా చేస్తే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
- అర టీ స్పూన్ ఇంగువపొడి , ఒక టీ స్పూన్ తాజా అల్లం రసం, ఒక టేబుల్ టీ స్పూన్ తేనె లను బాగా కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు పూటలా తీసుకుంటే దగ్గును తగ్గించుకోవచ్చు.
- కరక్కాయ కూడా పొడి దగ్గును తగ్గించడంలో దోహదపడుతుంది. కరక్కాయ ముక్కను బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని మింగుతుంటే పొడి దగ్గు వెంటనే తగ్గిపోతుంది.
- పాలలో మిరియాల పొడి వేసుకొని తాగితే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.
- తులసి ఆకులను వేడి నీటిలో వేసి బాగా మరిగించి ఆ కషాయాన్ని తాగడం ద్వారా దగ్గును తగ్గించుకోవచ్చు.
- తమలపాకులను నమలడం వల్ల కూడా పొడి దగ్గుకు చెక్ పెట్టవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa