ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లారీ కారు ఢీకొన్న సంఘటనలో ఏడుగురుకి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 02, 2022, 01:14 PM

లారీ కారు ఢీకొన్న సంఘటనలో ఏడుగురు గాయపడ్డారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బొండపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం రామబద్రపురం నుంచి విశాఖపట్నం వెళ్తున్న లారీ విజయనగరం నుంచి గజపతినగరం వైపు వస్తున్న కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారు యజమాని బొండపల్లి మండలం గిట్టుపల్లి గ్రామానికి చెందిన లగుడు దేవుడు తో పాటు లారీ డ్రైవర్ రామభద్రపురం గ్రామానికి చెందిన పూడి రామకృష్ణ, రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామానికి చెందిన బూరాడ పోలినాయుడు, బూరాడ చంద్రశేఖర్, పెదమానాపురం గ్రామానికి చెందిన చిల్లా సురేష్ గొటివాడ నాజర్, బొంగ పావని లు గాయపడ్డారు. గాయపడిన వారిని వైద్య చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. సంఘటన విషయం తెలిసిన వెంటనే మొబైల్ హెచ్. సి నాగరాజు సిబ్బందితో వెళ్లి చర్యలు చేపట్టారు. అదేవిధంగా గజపతినగరం సి. ఐ డి. రమేష్ సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa