రఘువీరా రెడ్డి , ఈ పేరు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు బాగా తెలిసినదే. అలానే ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యకుడిగా కూడా ఆయన పనిచేసారు. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ కి ఘోర పరాజయం ఎదురైనా సమయం నుండి ఇతను రాజకీయాలకి దూరంగా ఉంటూ, తన సొంత ఊరికి వెళ్లి వ్యవసాయం చేస్తున్నాడు అని ప్రచారం జరిగింది. అంతే కాకుండా ఎక్కడ కనీసం ప్రెస్ మీట్ కూడా ఈయన పెట్టకపోవడం ఈ మాటకి పునాది వేసింది. ఐతే, తాజాగా మా తోటలో మంచి చింతచిగురు చూసి నా చిన్నతనంలో మా అమ్మ నరసమ్మ అలా నడుచుకుంటూ వెళ్లి మా తోటలో చింతచిగురు కోసుకొచ్చి పప్పులో, పచ్చడిలో, పులుసులో ఇలా పలు వంటకాల్లో నెయ్యి వేసి పెట్టిన రోజులు గుర్తుకొచ్చి,తోటలో చిగురుకోసుకొని పప్పు చేయించుకొని తినాలనిపించింది అని ఆయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa