ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతి పర్యటన సీఎం జగన్.. టూర్ షెడ్యూల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 05, 2022, 10:55 AM

తిరుపతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  నేడు శ్రీ బాలాజీ జిల్లా కేంద్రం తిరుపతిలో పర్యటించనున్నారు.టాటా కేన్సర్ కేర్ సెంటర్ను ప్రారంభించనున్న జగన్ . శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి భూమి పూజ చేయనున్న సీఎం. జగనన్న విద్యా దీవెన లబ్ధిదారులు, వారి తల్లిదండ్రులతో సమావేశం. ఈ పర్యటనలో భాగంగా తిరుపతిలో ఏర్పాటు చేయనున్న జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు.


లబ్ధిదారులు, వారి తల్లిదండ్రులతో జగన్ మాట్లాడతారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగింస్తారు.ఈ షెడ్యూల్ ప్రకారం  ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న జగన్... 11.05 గంటలకు తిరుపతి ఎస్వీ వెటర్నరీ కాలేజ్ గ్రౌండ్స్కు చేరుకుంటారు.ఆ తర్వాత 11.20 గంటలకు ఎస్పీ యూనివర్శిటీ స్టేడియం చేరుకుని 'జగనన్న విద్యాదీవెన' కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంభాషణ, అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.ఆ తర్వాత 12.55 గంటలకు శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకుంటారు. అక్కడ టీటీడీ చిన్నపిల్లల ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించి భూమిపూజలో పాల్గొంటారు.


అక్కడే ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి టాటా కేన్సర్ కేర్ సెంటర్ (శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ కేన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ హాస్పిటల్)కు చేరుకుని నూతన ఆసుపత్రిని ప్రారంభిస్తారు.కార్యక్రమం అనంతరం 2.25 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 3.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa