ఓ యువతితో అతడు ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్లకే విభేదాలు తలెత్తి వారు విడిపోయారు. అయితే అనుకోకుండా తన స్నేహితుడితో ఆమె కనిపించింది. వారిద్దరూ రిలేషన్లో ఉన్నారని తెలుసుకుని పగతో రగిలిపోయాడు. తనకు దక్కాల్సిన దానిని స్నేహితుడు ఎగరేసుకుపోయాడని మనసులో కక్ష పెంచుకున్నాడు. చివరికి పక్కా ప్లాన్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
రాజస్థాన్లోని అల్వార్ జిల్లాకు చెందిన పరమ్ జీత్ సింగ్, దీపక్ కుమార్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. వారిద్దరి మధ్య ఒకరి కోసం మరొకరు ప్రాణం ఇచ్చేంత స్నేహం ఉంది. ఇక పరమ్జీత్ కొంత కాలం క్రితం ఓ యువతితో ప్రేమలో మునిగి తేలాడు. వారిద్దరికీ చెడడంతో ఆమె అతడికి గుడ్ బై చెప్పేసింది. అనుకోకుండా కొన్నాళ్లకే పరమ్జిత్ స్నేహితుడు దీపక్తో ఆ యువతి ప్రేమలో పడింది. ఇది తెలుసుకున్న పరమ్జీత్ తన స్నేహితుడు దీపక్పై అక్కసు పెంచుకున్నాడు. తన ప్రేమ అతడే చెడగొట్టాడని భావించాడు. స్నేహానికి విలువ ఇవ్వకుండా తన ప్రియురాలితో సంబంధం పెట్టుకున్నాడని పగ పెంచుకున్నాడు.
దీంతో అతడితో మాట్లాడాలని మంగళవారం పిలిపించాడు. అతడు రాగానే ప్రియురాలి విషయంపై గొడవ పడ్డాడు. గొడవ మధ్యలో స్నేహితుడు దీపక్ తలపై కర్రతో బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు దీపక్ కింద పడిపోయి అక్కడే ప్రాణాలు వదిలేశాడు. ఆ తర్వాత దీపక్ మృతదేహాన్ని పరమ్జీత్ సంచిలో పెట్టి అడవిలోకి తీసుకెళ్లి, పాతిపెట్టాడు. దీపక్ కనపడకపోవడంతో పరమ్జిత్పైనే అనుమానం వ్యక్తం చేస్తూ, అతడి కుటుంబ సభ్యులు కేసు పెట్టాడు. పోలీసుల విచారణలో పరమ్ జీత్ నేరం అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి, రిమాండ్కు పంపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa