పల్నాడు జిల్లా, నరసరావుపేట నియోజక వర్గంలో టీడీపీ కి రోజు రోజుకి ప్రజలలో ఆదరణ పెరుగుతుందనే చెప్పాలి. అందుకు కారణం అక్కడ టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి , చదలవాడ అరవింద్ బాబు అని ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వంలో లేకపోయినా, పదవులు లేకపోయినా, ప్రజలకి మేలు చెయ్యడానికి ఇవన్నీ అవసరం లేదు అని ప్రతి సంఘటనలోను నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన వెనక బడిన తరగతుల నుండి వచ్చిన వారు కాబట్టి , పేద ప్రజల కష్టాలు అర్థం చేసుకోవడంలో ఎంతగానో సక్సెస్ పొందారని చెప్పవచ్చు. దాని కారణంగానే, కుల, మత , భాషలకు అతీతంగా అందరూ తమ సంతోషాన్ని అరవింద్ బాబుతో పంచుకోవడానికి ముందడుగు వేస్తున్నారు. తాజాగా నరసరావుపేట మండలం పెద్దతురకపాలెంలో ఘనంగా హాజరత్ పీర్ వలిషా ఉరుసు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉరుసు మహోత్సవం అరవింద్ బాబు పాల్గొని, ఉరుసు మహోత్సవం సందర్భంగా దర్గాలో ప్రత్యేక అలంకరణలు చేసి ప్రార్థనలు నిర్వహించడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa