నూతన సత్యసాయి జిల్లాలోని చెరువులు కుంటల మరమ్మతులకు నిధులు కేటాయించి సత్యసాయి జిల్లా అభివృద్ధికి తోడ్పాటును అందించాలని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబును మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు విన్నవించడం జరిగిందిని వై ఎస్ఆర్. సిపి సీనియర్ నాయకుడు తలమర్ల సంజీవరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు.
ఈ సందర్భంగా సంజీవ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర చేసిన సమయంలో అంబటి రాంబాబుతో కలిసి తాను కూడా పాదయాత్ర చేశానని, పాదయా త్ర సమయంలో ఉమ్మడి అనంతపురం జిల్లా యొక్క సమస్యలను వారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని ఆయన తెలిపారు. అంబటి రాంబాబు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంద ర్భంగా అమరావతికి వెళ్లి ఆయనకు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజే యడం జరిగిందన్నారు.
అనంతరం నూతన జిల్లాలోని సమస్యలను వారి దృష్టికి తీసుకు వెళ్లడంతో వాటి పరిష్కారానికి సహకరిస్తానని తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa