ఐపీఎల్ 15వ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది.అయితే ఈ మ్యాచ్లో చెన్నై ఘన విజయం సాధించింది. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ 17.4 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ బ్యాట్స్ మెన్ మిచెల్ మార్ష్ 25 పరుగులు, కెప్టెన్ రిషబ్ పంత్ 21 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 24 పరుగులు, డేవిడ్ వార్నర్ 19 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ మూడు వికెట్లు తీశాడు. డ్వేన్ బ్రేవో, జిమ్మర్ జీత్ సింగ్, ముఖేష్ చౌదరి తలో రెండు వికెట్లు తీశారు. మహిష తీక్షణ్ ఒక వికెట్ తీశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa