చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం నాడు చలో అమరావతి నేపథ్యంలో ఆదివారం నాడు అనంతలో సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ, కార్యవర్గ సభ్యుడు జగదీష్, జిల్లా కార్యదర్శి జాఫర్ హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ నుంచి శ్రీకంఠం సర్కిల్ మీదుగా రైల్వే స్టేషన్కు వెళ్తున్న సిపిఐ నాయకులను పొలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా రామక్రిష్ణ మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు, ఆర్టీసీ బస్సు, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై చలో అమరావతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ప్రజల పక్షాన తాము పోరాడుతుంటే ప్రభుత్వం పోలీసుల చేత గహనిర్బధాలు, అరెస్టులు చేయించడం దుర్మార్గం అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నియంత పాలన కొనసాగిస్తున్నాడని చెప్పారు. ప్రజలపై పన్నుల భారాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో జగన్ ప్రజల పాలిట బకాసురుల్లా తయారయ్యారని తూర్పారబట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa