వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో ఓడిపోవడం ఖాయమని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. పొత్తుల్లేకుండా ఎన్నికలకు చంద్రబాబు వెళ్లరని, ఒకవేళ అలా వెళ్తే ఆయనకు పరాభవం తప్పదని అన్నారు. దీనిని బాగా తెలుసుకున్న ఆయన పవన్ కళ్యాణ్తో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని పేర్కొన్నారు. 2014లో ఇదే తరహాలతో జనసేనతో జట్టు కట్టి అధికారంలోకి వచ్చాడని, గత ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికల బరిలోకి ఘోర ఓటమిని చవి చూశాడన్నారు. జనసేనాని పవన్తో చంద్రబాబు అనైతిక కలయికలో ఉన్నారని ఆరోపించారు.
ప్రతిపక్షాలు ఉమ్మడిగా వచ్చినా, వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు చంద్రబాబు ఏం మేలు చేశారని, ఎందుకు ఆయనకు ఓట్లేయాలని ప్రశ్నించారు. కుప్పంలోనూ టీడీపీ పరిస్థితి దిగజారిందని, అందుకే చంద్రబాబు అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారని అన్నారు. అయినా చంద్రబాబు ఓటమి పాలవడం ఖాయమని చెప్పారు. ఏపీలో ప్రతిపక్షాలు చెబుతున్నట్లు విద్యుత్ కోతలు లేవని, రైతులకు నిరంతరాయ విద్యుత్ పంపిణీ చేస్తున్నామని వివరించారు. పరిశ్రమలకు మాత్రమే విద్యుత్ కోతలు ఉన్నాయని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa