ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెడికల్ కాలేజ్ నిర్మాణానికి 505 కోట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 09, 2022, 11:03 AM

బాపట్లలో మెడికల్ కళాశాల, 500 పడకల వైద్యశాల నిర్మాణానికి ఇప్పటికే 55 ఎకరాల స్థలం కేటాయించి రూ. 475 కోట్ల మేరకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో, సాంకేతికంగా తలెత్తిన ఒక సంక్లిష్టతకి తనదైన శైలిలో పరిష్కారాన్ని రాబట్టారు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి.


బాపట్ల ప్రాంతంలో మెడికల్ కళాశాలను నిర్మించే నేల స్వభావం రేగడి భూమి కావటం వల్ల, నిర్మాణ పనులలో, ప్రతి భవనానికి కాంక్రీట్ పునాది నిర్మించాల్సి ఉంటుందని, ఇది నిర్మాణ వ్యయాన్ని పెంచే అవకాశం ఉందని ఇంజినీరింగ్ అధికారులు తెలియ జేయగారుక్షణమే రంగంలోకి దిగిన కోన రఘుపతి, ఈ విషయాన్ని సిఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. బాపట్ల మెడికల్ కళాశాల నిర్మాణ వ్యయం, అంచనా వ్యయం రూ. 475 కోట్లకి మించే అవకాశం ఉందని, అదనంగా మరో 30 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి పై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం జి. ఓ నె: 48, తేదీ: 27/04/2021 ద్వారా బాపట్ల మెడికల్ కళాశాల నిర్మాణ వ్యయాన్ని రూ. 475 కోట్ల నుండి రూ. 505 కోట్లకి పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసింది.


ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అన్నారు. లేనిపోని అవరోధాల్ని సాకుగా చూపే ప్రభుత్వం కాదని, అవరోధాల్ని ఎలాగైనా అధిగమించి అభివృద్ధి చేసి తీరాలనే సంకల్పం ఉన్న ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. సీఎం వై యస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa