సూర్యుడు గతవారం రోజుల నుండి ఎండలు మండుతుండటంతో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గ్రామాల్లోని అన్ని రహదారులు, ఎప్పుడూ రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంతం, నిర్మానుష్యంగా మారుతున్నాయి.
సాయంత్రం 5: 00 దాటే వరకు ఇళ్లల్లో నుండి ప్రజలు బయటికి రావడం లేదు. సాధారణంగా వేసవిలో ఎక్కువమందిని ఇబ్బందులకు పాలు చేసేది వడదెబ్బ. తీవ్రస్థాయిలో వడదెబ్బ తగిలితే ప్రాణాలకే ముప్పు జరిగే ప్రమాదముంది.
ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో శరీర ఉష్ణోగ్రత 40. 5 సెల్సీయస్ కంటే ఎక్కువ అయినప్పుడు ఉష్ణోగ్రతను నియంత్రించే మెదడులోని కేంద్రం దెబ్బతినడం వల్ల వడదెబ్బకు గురవుతారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజా జీవనంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
అంతేకాక విద్యుత్ కోతలు కూడా భారీగా వుండటంతో ఇండ్లలో వుండాలన్న ప్రజలు ఉక్కపోతలకు తట్టుకోలేకపోతున్నారు. దీంతో పనులకు పోవాలంటే భానుడి ప్రతాపానికి బెంబిలెత్తిపోతున్నారు.
ఉదయం ఆరు గంటలకు వెళ్లి పది గంటలకు వచ్చేస్తున్నారు. తిరిగి సాయంత్రం ఐదు గంటలకు పనులకు వెలుతున్నారు. వడదెబ్బలకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే రోజు నీళ్లు ఎక్కువుగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఎండ నుండి ఉపశమనం పొందాలంటే తగు జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బకు గురవుతారని అంటున్నారు. అంతేకాక మార్కెట్లో కూడా వేసవి నుంచి ఉపశమనం పొందే పండ్లకు గిరాకీ పెరిగింది. ఐస్ క్రీమ్ సెంటర్లు, జూసు సెంటర్లు, దోసకాయలు, పుచ్చకాయలు కొబ్బరి బొండాల విక్రయదారుల కు లాభాల పంట పండుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa