సత్యసాయి జిల్లా పోలీసుకార్యాలయంలోస్పందన కార్యక్రమంలో భాగంగా జరిగిన స్పందనకు 47 ఫిర్యాదులు వచ్చాయి. అందులో ఎక్కువగా భూ సమస్య ప్రధానంగా ఉన్నాయి. సోమవారం ఉదయం ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన స్పందనకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదు చేశారు.
జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు నేరుగా వచ్చి ఎస్పీకి ఫిర్యాదు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. పుట్టపర్తి ఉజ్వల ఫౌండేషన్ ఆక్రమణలకు సంబంధించిఈవారం కూడా నమిత సాయి ఫిర్యాదు జిల్లా ఎస్పీ వచ్చిన పిటిషన్లపై సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరించవలసినదిగా ఆదేశించారు.
కార్యక్రమంలో అదనపు ఎస్పి రామకృష్ణ ప్రసాద్ తో పాటు పలువురు పాల్గొనగా, బాధితుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఎస్పీ కార్యాలయం వాటి పరిష్కారానికి సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa