ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలకు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. చంద్రబాబు తెలివిగా ఎల్లో మీడియా ద్వారా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు అని, బాబు వస్తే ప్రజలకు బోడి గుండు తప్పదన్నారు. ప్రతిపక్షం, ఎల్లోమీడియా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. శ్రీకాకుళం ఆనందమయి ఫంక్షన్ హాల్లో వైయస్ఆర్ సీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
"గడిచిన మూడు సంవత్సరాలుగా అమ్మ ఒడి ఎంత మందికి అందింది? ఎంత మందికి రైతు భరోసా అందింది? ఈ ప్రభుత్వం మీకు ఏ మేరకు న్యాయం చేసింది.. ఏ మేరకు పథకాల అమలుకు కృషి చేస్తోంది అన్నవి వివరిస్తూ వెళ్లాలి. ఇది ఒక్క ఎమ్మెల్యేలు చేసే పని కాదు కార్యకర్తలు కూడా కదలి వస్తేనే సాధ్యం. వలంటీరుతో పాటు కార్యకర్త కూడా ఇంటింటికీ తిరిగితే సంక్షేమ పథకాలు అందాయా లేదా అన్నది తెలుసుకోవాలి. ఆ విధంగా 11వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే ఇంటింటికీ వైయస్ఆర్ సీపీ కార్యక్రమంలో భాగంగా రానున్న రెండు నెలల కాలంలో క్షేత్ర స్థాయిలో నిజానిజాల గుర్తింపు అనంతరం సమగ్ర సర్వే పూర్తవుతుంది. ఒక్కో గ్రామ సచివాలయ కేంద్రానికి ఒక్కో ఇంఛార్జ్ ను నియమించి పనిచేయాల్సి ఉంది. అదేవిధంగా క్షేత్ర స్థాయిలో అవినీతిని నిలువరించాల్సి ఉంది. లబ్ధిదారుకే నేరుగా పథకాల ఫలాలు అందేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నాం వంటి వాస్తవిక విషయాలను గ్రామగ్రామాన తెలియజేయాలి" అని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa