ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన షురూ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 10, 2022, 08:42 PM

చంద్రబాబునాయుడు రేపటి నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. శాంతిపురం, గుడిపల్లె మండలాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు శాంతిపురం మండలం బెల్లకోకిలకు చంద్రబాబు చేరుకుంటారు. బోయనపల్లిలో  'బాదుడే బాదుడు' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నెల 12న సీగలపల్లిలో జరిగే జాతరలో చంద్రబాబు పాల్గొననున్నారు. 13న కుప్పంలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు భేటీ కానున్నారు. పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాలపై చంద్రబాబు సమీక్షించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa